మార్చి 2 (శుక్రవారం)న ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు


హోలీ పండుగ సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి-28) నుంచి నగరంలో మద్యం షాపులు మూతపడనున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు మూసివేయాలని ఆదేశించారు పోలీసులు. దీంతో ఈ సాయంత్రం నుంచి 48 గంటలు మద్యం షాపులు మూతపడనున్నాయి.
హోలీ సెలవు
మరోవైపు హోలీ పండుగ సందర్భంగా మార్చి 2 (శుక్రవారం)న ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల కేలెండర్‌లో మార్చి 1న సాధారణ సెలవుగా గుర్తించారు. కేంద్రం మార్చి 2న హోలీ సెలవు ఇచ్చింది. దీంతో దేవాదాయశాఖను సంప్రదించిన రాష్ట్రప్రభుత్వం హోలీ సెలవును యథాతథంగా ఉంచుతూనే మార్చి 2ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది.

Post a Comment

0 Comments