రైల్వేకోడూర్‌లో షిరిడీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

షిర్డీ ఎక్స్ ప్రెస్ కు మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీ పట్టాల మీది నుంచి కిందికి దిగబడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రేణిగుంట జంక్షన్ నుంచి సిబ్బందిని రప్పించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే రైల్వేస్టేషన్‌ను సమీపించిన రైలు నెమ్మదిగా రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రైల్వేకోడూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేసిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. 




Post a Comment

0 Comments